Friday, April 26, 2024

న‌మీబియాపై భారత్ సునాయస విజయం..

- Advertisement -
- Advertisement -

అబుధాబి: టీ20 ప్రపంచకప్ సూప‌ర్ 12లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్ లో న‌మీబియాపై టీమిండియా సునాయస విజయం సాధించింది. నమీబియా నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 136 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(56), కెఎల్ రాహుల్(54 నాటౌట్)లు అర్థశతకాలతో రాణించారు. దీంతో నమీబియాపై భారత్ 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. నమీబియా బ్యాట్స్ మెన్లలో వీస్(26), బార్డ్(21)లు పర్వాలేదనిపించినా.. మైకెల్(14), గెర్హార్డ్(12), స్మిత్(9), హెరాస్మస్(12)లు విఫలమయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా, అశ్విన్ చెరో 3 వికెట్లు తీయగా.. బుమ్రా రెండు వికెట్లు తీశారు.

T20 World Cup:India win by 9 wickets against NAM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News