Friday, May 3, 2024

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలిస్తున్నాడు. చార్మినార్, మొజం జాహీ మార్కెట్ ల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 40 వేల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని చెప్పారు. వీటిలో కొన్ని 3వ రోజు, 5వ రోజు మరికొన్ని విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగిందన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే అతి పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం త్వరగా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామని.. భక్తులు, ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మంత్రి చెప్పారు.

Talasani Srinivas inspects ganesh nimajjanam works

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News