Friday, April 26, 2024

వరంగల్ ఎన్నికలు… ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

Teacher dead with heart attack in Warangal

 

వరంగల్: మున్సిపాలిటీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ పరిధిలో జరిగింది. రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నాడు. వరంగల్‌లోని మున్సిపాలిటీ 57వ డివిజన్‌లోని సమ్మయ్య నగర్‌లో రమేష్‌కు పోలింగ్ బూత్ కేటాయించారు. పోలింగ్ విధులు నిర్వహిస్తుండగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్ల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News