Tuesday, May 7, 2024

బ్రాండింగ్‌లో హై

- Advertisement -
- Advertisement -

Metro travel according to Covid-19 rules

అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి

ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగి ఉండి, సుమా రు 72కి.మీ. 66 స్టేషన్లు, నిరాటంక ప్రయాణానికి వీలుగా ఎంఎంటీఎస్ స్టేషన్లు, బస్‌డిపోలతో అనుసంధానమైన సమగ్ర రైలు టెర్మినల్స్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రత్యేకత. స్మార్ట్‌కార్డుతో ఆటోమేటిక్ టికెట్ జారీ, గేట్ సిస్టమ్ వ్యవస్థ, పర్యావరణహిత ప్రయాణ విధానం, వాయుకాలుష్య, శబ్దకాలుష్య రహిత ప్రయాణం హైదరాబాద్ మెట్రోరైల్ అదనపు ప్రత్యేకతలు. రూ.17,290.31 కోట్లతో దీనిని మూడు కారిడార్లుగా విభజిస్తూ నిర్మాణాలను పూర్తిచేశారు.

రూ.15కోట్లతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్

దేశంలోనే విపత్తు నిర్వహణకోసం ప్రత్యేకంగా రూ.15కోట్లను వెచ్చించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇటీవల హైదరాబాద్‌లో వరదముంపు నుంచి వేలాదిమంది ప్రజలను డిఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొవిడ్-19 వ్యాప్తి నిరోధానికి నగరంలో నాలుగుసార్లు డిస్‌ఇన్‌ఫెక్ట్ స్ప్రే చేశారు. విపత్తు వేళ సహాయ చర్యలకోసం డిఆర్‌ఎఫ్‌లో 360మంది సిబ్బంది పని చేస్తున్నారు. నిల్వ ఉన్న నీటిని, భవనాల శిథిలాలను తొలగిం చి బాధితులను కాపాడటం, వరద సహాయక చర్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, భవనాలు కూలినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో వీరి సేవలు ప్రశంసలందుకుంటున్నాయి.

రూ.1940.33 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ ఆధునీకికరణ

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శాంతి భద్రతలపై దృష్టి సారించింది. రూ.1940.33 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించింది. కర్ఫ్యూలకు, అల్లర్లకు స్వస్తిపలికి భద్రతకు సరికొత్త నిర్వచనం చెప్పింది. అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, నగరవాసుల భద్రత కోసం 5 లక్షల సిసి కెమెరాలు, ‘హ్యాక్ ఐ’ యాప్, పోలీ స్ గస్తీ బృందాల కోసం అధునాతన వాహనాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌స్టేషన్లు ఆహ్లాదంగా కనబడేలా సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఎంతపెద్ద నేరం జరిగినా కేవలం నిమిషాల వ్యవధిలోనే నేరస్తులను పట్టుకునే నిఘా వ్యవస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. నగరాన్ని అనుక్షణం కనిపెట్టుకునేలా ఇంటిగ్రేటెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ హబ్, మహిళల, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, సైబర్ నేరాల నియంత్రణకు, ఛేదనకు ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

మనతెలంగాణ/హైదరాబాద్ : వేగంగా అభివృద్ధి చెందుతు న్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ మహానగర ప్రగతికి నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా రవాణా సౌకర్యాల్లో కీలకమైన రహదారుల అభివృద్ధి, ప్లైఓవర్లు, లింకురోడ్ల నిర్మాణం, కూడళ్ల సుందరీకరణ కు ఐదేళ్లలో అధిక నిధులు వెచ్చించింది. జిహెచ్‌ఎంసి పరిధి లో స్వచ్ఛత పెంపుదల సహా మొక్కల పెంపకం, ఉద్యానవనా ల అభివృద్ధి, పర్యాటకరకంగం, వారసత్వ భవనాల పరిరక్షణ కు ప్రభుత్వం పటిష్టమైన చర్యలను చేపట్టింది. పోలీసు వ్యవస్థ ను మెరుగుపరచడం వలన ప్రజలకు, మహిళలకు రక్షణ పెరిగింది. దీనివలన మహానగరం బ్రాండ్ విలువ పెంచింది. ఫలితంగా 5 సంవత్సరాల్లో నగరానికి రెండు లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగింది.
రూ.34.66 కోట్లతో టూరిజం అభివృద్ధి
పర్యాటకానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.34.66 కోట్ల తో టూరిజం అభివృద్ధికి కీలక చర్యలు తీసుకున్నారు. ఇందు లో భాగంగా అతిథ్య గృహాలు (హోటల్స్, క్యాటరింగ్ యూని ట్లు), రవాణా సౌకర్యం (గైడెడ్ ప్యాకేజీ టూర్స్), వాటర్ ఫ్లీట్, సౌండ్-లైట్‌షోలు, పర్యావరణహిత టూరిజం, సాంస్కృతిక కట్టడాల పునరుద్ధరణ, కొత్త టూరిజం కట్టడాల నిర్మాణం, రూ.100 కోట్లతో వారసత్వ సంపదకు పూర్వవైభవం తీసుకువచ్చారు. అలాగే చారిత్రక కట్టడాలైన మొజంజాహీ మార్కెట్, చార్మినార్‌పై చార్‌కమాన్, లాడ్‌బజార్, మహబూబ్ చౌక్ క్లాక్‌టవర్, షాలిబండ క్లాక్ టవర్, పాత బ్రిటిష్ రెసిడెన్సీలకు గత వైభవం ఉట్టిపడేలా ఆధునిక హంగులను అద్దారు.
15 లక్షల ఉద్యోగాలు
పరిశ్రమలు, ఐటి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించిన ప్రభుత్వం టిఎస్ ఐపాస్ ద్వారా రూ.2,115.93 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. అలాగే రూ.1,96,404 కోట్ల పెట్టుబడుల ఆకర్షించడంతో పాటు 15లక్షల ఉద్యోగాలను కల్పించారు. టిఎస్ ఐపాస్ ద్వారా 9,500 పారిశ్రామిక యూనిట్లకు అనుమతి ఇవ్వగా, ఇప్పటికే 6,300 యూనిట్లు ఆపరేషన్స్ ప్రారంభించాయి. 2020లో జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఐటి రంగ వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. భారత్‌లోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ హైదరాబాద్‌లోని టిహబ్. ఇప్పటికే 1,100కు పైగా స్టార్టప్‌ల అనుసంధానం, 1,500కు పైగా ఉద్యోగాల కల్పనతో పాటు స్టార్టప్‌ల కోసం రూ.1,800 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. స్కిల్స్, నాలెడ్జ్ ఉన్న వారి కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ఏర్పాటు చేసింది.

స్వచ్ఛ హైదరాబాద్‌కు ప్రభుత్వం రూ.1716.33 కోట్ల నిధులు

Compactor Vehicles

స్వచ్ఛ హైదరాబాద్‌కు ప్రభుత్వం రూ.1716.33 కోట్ల నిధుల ను ఖర్చుచేసింది. పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చడంతో పాటు నగరంలో స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రతి గల్లీలోనూ అందుబాటులోకి తీసుకొచ్చి చెత్త సేకరణలో కొత్త పద్ధతులను పాటించింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో ఎనర్జీప్లాంట్ ఏర్పాటుతోపాటు గ్రీన్ క్యాపింగ్ చేయడంతో ఆ ప్రాంతంలో దుర్వాసన పోయింది. వేల సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి ప్రజల కు అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యర్థాల తరలింపు, ప్రాసెసింగ్ కొరకు కొత్తగా రెండు యూనిట్లను నెలకొల్పారు.
రూ. 8,410.00 కోట్లతో ట్రాఫిక్ సమస్యలకు సమగ్ర పరిష్కారం
వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ. 8,410.00 కోట్లతో ట్రాఫిక్ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపింది ప్రభుత్వం. జనసమ్మర్ద రూట్లలో సిగ్నల్ లేని ప్రయాణం లక్ష్యంగా కొత్త రోడ్లు, ప్లై ఓవర్లు,గ్రేడ్ సపరేటర్లు, రైల్వేఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు అండర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణాలను చేపట్టింది. దుర్గంచెరువుపై నిర్మించిన 233.85 మీటర్ల కేబుల్ వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ట్రా డోస్డ్ కేబుల్‌బ్రిడ్జి. ఎస్సార్డీపీలో భాగంగా ముఖ్యమైన జంక్షన్లలో 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 ఆర్వోబీలు, దుర్గంచెరువుపై కేబుల్‌బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రధాన రహదారులకు అనుసంధానంగా రూ. 313.65 కోట్లతో 126.2 కి.మీ. మేర 137 లింక్ రోడ్ల నిర్మాణం సాగుతోంది.
ప్రధాన మార్గాలు సిగ్నల్ ఫ్రీగా…
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రయాణాలతో రోడ్డు రవాణా మార్గాలను అభివృద్ధిచేశారు. పౌరుల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక అవకాశాలు, పనిపరిస్థి తులు, విశ్రాంతి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నాణ్య మైన రహదారులను ఏర్పాటు చేశారు. రూ.16,622 కోట్లతో వ్యూహాత్మక రహదారి అభివృద్ధిప్రణాళిక (ఎస్సార్డీపీ), నమూ నా రహదారి కారిడార్లు, అనుసంధానరోడ్లు(హెచ్చాఆర్‌డిసిఎల్), సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం(సిఆర్‌ఎంపి), హైవే ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (హెచ్‌టిఎంఎస్), ఔటర్ రింగ్ రోడ్డుతో ప్రధాన మార్గాలను సిగ్నల్ ఫ్రీగా మార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News