Sunday, May 12, 2024

తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana corona cases last 24 hours

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుమఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 44 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా 518 మందికి పాజిటివ్ రాగా ముగ్గురు చనిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.84 లక్షలకు చేరుకోగా 1527 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాధి నుంచి 2.75 లక్షల మంది కోలుకోగా 6839 మంది చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 66.55 లక్షల మంది కరోనా టెస్టులు చేశామని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో పదకొండో స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ (8.8 లక్షలు) మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో మహారాష్ట్ర (19.09 లక్షలు), కర్నాటక(9.13 లక్షలు) రెండో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News