- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందున్న ట్రాక్టర్ను స్టార్ ట్రావెల్స్ ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడడంతో పాటు ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
- Advertisement -