- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1536 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కేసుల సంఖ్య 2.42 లక్షలకు చేరుకోగా 1351 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2.23లక్షలకు చేరుకోగా 17 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్క రోజు 45 వేల టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 43.94 లక్షలకు చేరుకుంది.
- Advertisement -