Sunday, May 12, 2024

11న గ్రూప్-1 ప్రిలిమ్స్ యథాతథం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షను ఆ పాలని నాలుగు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకో ర్టు పిటిషన్లను కొట్టేసింది. దీంతో ఈ నెల 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ నెల 11న యథావిథిగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇదిలా ఉంటే టిఎస్‌పిఎస్‌సిలో ప్రశ్నపత్రాల లీకే జీ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు పలు పరీక్షను రద్దు చేశారు. అ యితే తాజాగా ఈ నెల 11న గ్రూప్ 1 పరీక్ష ను నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి సిద్ధ్దమైంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in / నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల ని కమిషన్ సూచించింది. అయితే పేపర్ లీక్ ఆ రోపణలు ఎదుర్కొంటున్న చేతనే మళ్లీ పరీక్షను నిర్వహించడంపై పలువురు అ భ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో తొలి గ్రూప్1 నోటిఫికేషన్
తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ గత ఏడాది విడుదలైంది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా టిఎస్‌పిఎస్‌సి గ్రూప్1 ప్రి లిమ్స్ పరీక్షను గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించారు. ఫలితాలు
విడుదలైన తరువాత, మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణకు సైతం కమిషన్ ఏర్పాట్లు చేసింది. కానీ అదే సమయంలో టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన పలు ఎగ్జామ్ పేపర్లు ముందే లీకయ్యాయని గుర్తించారు. ఈ క్రమంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు డిఎఒ, ఎఇఇ, ఏఇ లాంటి మరికొన్ని ఎగ్జామ్‌లను టిఎస్‌పిఎస్‌సిరద్దు చేసింది. కొన్ని పరీక్షలను నిర్వహణకు ముందే వాయిదా వేసి, కొత్త పేపర్లతో ఎగ్జామ్ నిర్వహిస్తామని కమిషన్ అధికారులు తెలిపారు. గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు చేసింది. అయితే పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 10.15 తర్వాత అభ్యర్థులను ఎవరినీ ఎగ్జామ్ సెంటర్‌కు అనుమతించేది లేదని టిఎస్‌పిఎస్‌సి స్పష్టం చేసింది. ఓఎంఆర్ పత్రంలో మీ వివరాలు జాగ్రత్తగా నింపాలని, తప్పులు జరిగితే కొత్త ఓఎంఆర్ ఇచ్చేది లేదని అభ్యర్థులకు కమిషన్ అధికారులు సూచించారు.

కాగా, అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. ఇక ప్రిలిమ్స్ కీలో వెలువడిన అభ్యంతరాల నేపథ్యంలో 5 ప్రశ్నలు తొలగించి కమిషన్ తుది కీ ఖరారు చేసింది. పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మంది అభ్యర్థులను టిఎస్‌పిఎస్‌సి మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వెలుగుచూడడంతో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష రద్దు చేసి, మళ్లీ రీషెడ్యూల్ చేసి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News