- Advertisement -
హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫలితాలు బుధవారం లేదా గురువారం ఫలితాలు రోజుల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. థియరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3 నుంచి 7 వరకు ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -