Monday, May 6, 2024

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 434 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారి నుంచి 129 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,680 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 292 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 71 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 28 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. అందరూ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. దేశంలో బుధవారం కొత్తగా 12,200లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 13 మరణాలు సంభవించాయి.

Telangana Reports 434 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News