Friday, May 3, 2024

రాష్ట్రంలో కొత్తగా 569 కొవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 569 new corona cases

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌లో 615 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 569 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 51,518 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 569 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,84,631కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.తాజాగా కరోనా నుంచి 2,098 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,72,145 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.41 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 615 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 2,787 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,550 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల్లో 22,267 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ కారణంగా.. రాష్ట్రంలో నలుగురు మరణించారు.

Telangana Reports 569 new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News