Saturday, April 27, 2024

యూత్ పార్లమెంట్‌లో అద్భుతంగా ప్రసంగించిన తెలంగాణ విద్యార్థిని మౌనిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా జరిగిన పోటీలలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి నుంచి ఎంపికైన విద్యార్థిని కె.మౌనిక ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన యూత్ పార్లమెంట్‌లో అద్భుతంగా ప్రసంగించారు. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి, దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన మౌనికకు అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి మాట్లాడే అవకాశం లభించగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మౌనికను అభినందించారు.

కామారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన కె. మౌనిక తండ్రి డిసిఎం డ్రైవర్‌గా, తల్లి బీడీలు చుట్టూతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, అందులో మొదటి అమ్మాయి మౌనిక. ఆమె చిన్నప్పటినుంచే సివిల్స్ ర్యాంకు సాధించాలి అనే పట్టుదలతో ఉన్నారు. కామారెడ్డిలోని ఆర్.కె డిగ్రీ అండ్ పిజి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని అదే కళాశాలలో పిజి చదువుతున్నారు. తెలంగాణ నుండి ఒకే విద్యార్థిని మౌనికకు మాత్రమే పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా పెంపొందించినందుకు మౌనికను, ఆమె తల్లిదండ్రులను, ఆర్.కె.కళాశాల కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News