Tuesday, April 30, 2024

కావాలనే నాపై విష ప్రచారం చేస్తున్నారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

అసత్య ప్రచారం చేస్తున్న వాళ్లు ఏం సాధిస్తారో తెలియడం లేదు
గాంధీ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం
బిఆర్‌ఎస్ పార్టీలో చేరను
బిఆర్‌ఎస్‌తో పోరాటానికి తాను ఎప్పుడైనా సిద్ధమే

మనతెలంగాణ/హైదరాబాద్:  సోషల్ మీడియాలో కొంతకాలంగా తనపై జరుగుతున్న విష ప్రచారంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏడాదిన్నరగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అసత్య ప్రచారం చేస్తున్న వాళ్లు ఏం సాధిస్తారో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సంగారెడ్డి నియోజకవర్గంలో 22 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని ఆయన తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ కేడర్‌ను చూసి రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోయారన్నారు. ‘యాత్రను బాగా సక్సెస్ చేశారు జగ్గారెడ్డి’ అని రాహుల్ గాంధీ తనను ప్రశంసించారని ఆయన గుర్తుచేశారు.

భారత్ జోడో యాత్ర సమయంలోనే తన పేరు కూడా రాహుల్‌కు నోటెడ్ అయ్యిందని ఆయన తెలిపారు. యాత్రను సక్సెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డానని, గాంధీ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని, అలాంటి తనపై ఎందుకు ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పాత్రయాత్ర జరిగిన పది రోజులకే తాను పార్టీ మారబోతున్నట్లు ప్రచారం మొదలెట్టారని ఆయన మండిపడ్డారు. 2018లోనే తనపై కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టారని అలాంటిది బిఆర్‌ఎస్‌లోకి తానేందుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌తో పోరాటానికి తాను ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావొద్దని తన భార్యను పోటీకి పెట్టానని, సిఎం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండాలని నిలబెట్టానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News