Saturday, May 4, 2024

కరోనా రోగి ఇంట్లో మటన్ తో విందు భోజనం చేసిన దొంగలు…

- Advertisement -
- Advertisement -

Thieves cook mutton after flee with cash-jewellery

రాంఛీ: కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి మటన్ కూరతో విందు భోజనం చేసి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఝార్ఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జుగ్‌సలాయ్ ప్రాంతంలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలు ఉండడంతో ఆరోగ్య సిబ్బంది టాటా మెయిన్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. శుక్రవారం అతడికి టెస్టు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ఇంటి పక్కనే సొదరుడు ఉండడంతో శనివారం ఉదయం అతడి ఇంటికి వెళ్లి చూడగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడ్డారని అనుమానం రావడంతో పర్సుదిహ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మటన్ కూర, చపాతీ, అన్నం వండుకొని విందు భోజనం చేసిన అనంతరం ఇంట్లో ఉన్న 50 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News