Wednesday, May 8, 2024

టపాకాయలు కాల్చి చూపించాడు…. తాత, మనమళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

Three members dead in Cracker shop firing

 

చిత్తూరు: టపాకాయలు ఎలా కాల్చాలో కొనుగోలుదారుడికి చూపించాడు.. ఈ క్రమంలో అగ్ని ప్రమాదానికి గురికావడంతో ఘటనా స్థలంలో ముగ్గురు చనిపోయిన సంఘటన చిత్తూరు జిల్లా వేలూరు ప్రాంతం కాట్పాడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…లత్తేరి బస్టాండ్ వద్ద మోహన్ రెడ్డి(55)కి టపాకాయల దుకాణం ఉంది. ఆదివారం ఉదయ తన మనువళ్లు తేజశ్వరన్, ధనుష్ తో కలిసి దుకాణం తెరిచాడు. కొనుగోలు దారుడు వచ్చినప్పుడు కొత్తరకం టపాకాయలు గురించి చెప్పాడు. రెండు టపాకాయలను కాల్చి చూపిస్తుండగా నిప్పు రవ్వలు దుకాణంలో పడడంతో టపాకాయలకు అంటుకున్నాయి. భారీ శబ్ధాలతో టపాకాయలు పేలడంతో పాటు అగ్ని ప్రమాదం సంభవించడంతో మోహన్ రెడ్డి, ఇద్దరు మనుమళ్లు చనిపోయారు. ఈ ఘటన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News