Sunday, April 28, 2024

ఫ్రీగా బిర్యానీ ఇవ్వలేదని… హోటల్ పైనే బాంబులు విసిరారు…

- Advertisement -
- Advertisement -

చెన్నై: రౌడీషీటర్ పేరు చెప్పినా ఫ్రీగా బిర్యానీ ఇవ్వలేదని హోటల్ పై బాంబు విసిరిన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అరుణాచల పాండ్యన్, మహారాజన్, గణేశన్ అనే స్నేహితులు కస్తూరీ భవన్ పేరుతో హోటల్ నడిపిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు హోటల్ వచ్చి ఎబిన్ అనే రౌడీ షీటర్ పేరు చెప్పి ఉచితంగా బిర్యానీ కావాలని డిమాండ్ చేశారు. బిర్యానీ అయిపోయిందని సిబ్బంది చెప్పడంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాలుగు బైక్ లపై ఎనిమిది మంది అక్కడికి చేరుకొని హోటల్ పై పెట్రోల్ బాంబులు విసిరారు. హోటల్ సిబ్బంది, నిర్వహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News