Friday, April 26, 2024

పిడుగుపాటుకు కుటుంబం బలి…

- Advertisement -
- Advertisement -

Three Members dead in Lightening in Kurnool

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దహ్యేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం పిడుగుపాటుకు బలైంది. భోజరాజు-మల్లమ్మ అనే దంపతులు మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులు తన కుమార్తెలు రేవతి(06), మల్లేశ్వరి(4), వెన్నెల(06)లతో సహా మేకలను మేపటానికి గ్రామ శివారుల్లోకి వెళ్లారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో ఓ వేప చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలోనే వారికి సమీపంలో పిడుగు పడడంతో ఘటనా స్థలంలోనే భోగరాజు, రేవతి చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మల్లమ్మను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. చిన్నారి మల్లేశ్వరి మాత్రం ప్రాణాలతో బయటపడింది. పిడుగు పడినప్పుడు మల్లేశ్వరి తన తల్లి ఒడిలో కూర్చోవడంతో పాటు ఆమె ముందుకు పడిపోవడంతో చిన్నారికి ఏమీ కాలేదని గ్రామస్థులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News