Sunday, May 5, 2024

చెరువులో మునిగి నలుగురు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్‌ : పిల్లలు చెరువులోకి స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందిన సంఘటన రాజస్థాన్ లోని కురు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భలేరి ప్రాంతంలో నలుగురు పిల్లలు స్నానం కోసమని చెరువులోకి వెళ్లారు. బాలుడు నీటిలో మునిగిపోతుండగా రక్షించేందుకు ముగ్గురు బాలుర్లు లోపలికి వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు బాలుర్లు మునిగిపోయారు. ఘటనా జరిగినప్పుడు పిల్లల తల్లిదండ్రులు పొలం పనుల్లో చేస్తున్నారు. బయట ఉన్న పిల్లలు సమాచారం ఇవ్వడంతో అప్పటికే నలుగురు బాలుర్లు చనిపోయారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లలు చనిపోవడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News