Saturday, May 4, 2024

కుటుంబ సభ్యులను రొకలి బండతో బాది హత్య…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: వివాదం విషయంలో ముగ్గురు కుటుంబ సభ్యులను కుమారుడు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరఖాన్ వీదిలో గుల్జార్ బేగమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. పెద్ద కుమారుడు కరీముల్లాకు భార్యతో గొడవలు జరుగుతున్నాయి. వివాదంలో కుటుంబ సభ్యులు తనకు సహకరించడంలేదని వారిపై పగ పెంచుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో తమ్ముడు మహమ్మద్ రఫీ తలపై కరీముల్లా రొకలి బండతో బాదాడు. అనంతరం తల్లి గుల్జార్ బేగం, చెల్లె కరీమున్నీసాపై కూడా దాడి చేశాడు. కరీముల్లా నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి హత్య చేశానని పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News