Monday, May 6, 2024

కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

Three militants killed in encounter in Kashmir

శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు వీర మరణం చెందారు. భ్రతా దళాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని అధీన రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉగ్రవాదులు అక్రమంగా చొరబడడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి. అనంతరం భద్రతా దళాలు నిఘాను పటిష్టం చేశాయి. అయితే కొంతసేపటికి పెద్ద సంఖ్యలో వచ్చిన ముష్కరులు భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డాయి. కాగా ఈ ఘటనలో ఒక ఆర్మీ అధికారి, మరో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మన జవాన్లు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా వెల్లడించారు. ఎల్‌ఓసి వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. గాయపడిన ఇద్దరు జవాన్లను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

Three militants killed in encounter in Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News