Saturday, May 4, 2024

మారుమూల గ్రామాలకు తక్షణమే త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం

- Advertisement -
- Advertisement -

Three phase electricity facility to tribal villages

హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రతి ఆదివాసి, గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి అన్నారు. మారుమూల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, పెండింగ్ లో ఉన్న పనులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విద్యుత్, గిరిజన సంక్షేమం, అటవీ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మొత్తం మూడు వేలకు పైగా గుర్తించిన గ్రామాలకు ఇప్పటికే త్రీ ఫైజ్ విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇంకా మిగిలిన 239 గ్రామాలకు కూడా నెల రోజుల్లో పనులు పూర్తి చేసి విద్యుత్ సౌకర్యం అందిస్తామని వెల్లడించారు. జిల్లాల వారీగా అదిలాబాద్ లో 46, కొమరం భీమ్ ఆసిఫాబాద్ 98, మంచిర్యాల 26, నిర్మల్ 42, భద్రాద్రి కొత్తగూడెంలో 27 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఇంకా అందించాల్సి ఉందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

జిల్లాల వారీగా ఉన్న సమస్యలు, అటవీ అనుమతులు, జాప్యం నివారణపై సమీక్షా సమావేశంలో చర్చించారు. అటవీ అనుమతులను వేగంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, అయితే అవసరమైన డాక్యుమెంటేషన్ సరైన పద్దతుల్లో పూర్తి చేస్తే ఆలస్యాన్ని నివారించవచ్చని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. గిరిజన గ్రామాలకు మౌళిక సదుపాయాల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యత అని, సంబంధిత శాఖలు పూర్తి సహకారంతో పూర్తి స్థాయి విద్యుత్ సౌకర్యం ఇచ్చేందుకు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ క్రిస్టీనా చోంగ్తు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్లు, విద్యుత్ శాఖ (ఎన్.పీ.డీ.సీ.ఎల్) సీఎండీ గోపాల్ రావు, ఎన్ పీడీసీఎల్ & ఎస్ పిడిసిఎల్, సీపీడీసీఎల్ డైరెక్టర్లు, జిల్లా అటవీ శాఖ అధికారులు, విద్యుత్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News