Saturday, May 4, 2024

బైక్ పై వెళ్తున్న దంపతులపై దాడి… భార్యపై సామూహిక అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Thugs rape on wife after attack on husband

 

అమరావతి: భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో పెళ్లి వేడుకకు హాజరై ఇంటికి బైక్‌పై తిరిగొస్తుండగా మేడికొండూరు ఎక్స్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డగించారు. భర్తను తీవ్రంగా కొట్టి భార్య చెట్ల పొదల్లోకి సామూహిక అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు డిఎస్‌పి ప్రశాంతి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఎక్స్ రోడ్డుకు సమీపంలో కోల్డ్ స్టోరేజీ నిర్మాణం జరుగుతోంది. ఒడిశా కూలీలు కోల్డ్ స్టోరేజీ నిర్మాణంలో పని చేస్తున్నారు. ఒడిశా కూలీలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News