Friday, April 26, 2024

భద్రాద్రి కొత్తగూడెంలో పులి సంచారం

- Advertisement -
- Advertisement -
Tiger Wandering In Bhadradri Kothagudem
భయాందోళనలో ప్రజలు, అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది

ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో గత మూడు రోజులుగా పులి సంచరిస్తోందనే వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం చాపరాలపల్లి పంచాయతీ కుమ్మరిపాడు అటవీ ప్రాంతంలో పులి కనిపించిందని ప్రజలు పేర్కొనడంతో ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎఫ్‌ఎస్‌వో కిషన్ సిబ్బందితో అడవులను పరిశీలించారు. మంగళవారం కమలాపురం, మాదారం అటవీ ప్రాంతంలో పులి కనిపించిందని కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై కెమేరాలతో అడవులలో పులి జాడ కోసం గాలిస్తున్నారు. బుధవారం ముత్యాలంపాడు అటవీ ప్రాంతంలో పులి కనిపించిందని, మూకమామిడి అటవీ ప్రాంతంలో పులి కనిపించిందని మరి కొందరు ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో సిబ్బందితో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Tiger Wandering In Bhadradri Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News