Friday, April 26, 2024

గురునానక్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions on guru nanak jayanti 2021

ఆదేశాలు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: సిక్కుల మతగురువు గురునానక్ 552వ జయంతి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నగరంలో సిక్కులు ర్యాలీ తీసే ప్రాంతాల్లో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని తెలిపారు. ర్యాలీ గురుద్వారా శ్రీగురు సింగ్ సభా అశోక్ బజార్ నుంచి ప్రారంభమై అఫ్జల్‌గంజ్, సిద్దంబజార్, మౌజంజాహి మార్కెట్, జాంబాగ్, పుత్లీబౌలి, రాంమందిర్, సెంట్రల్ గురు ద్వారా, గౌలిగూడ శంకర్ షేర్ హోటల్ నుంచి మళ్లీ గురుదావరా శ్రీ గురు సింగ్ సభా అశోక్ బజార్‌కు చేరుకుంటుంది. ర్యాలీలో 2,000 మంది సిక్కు భక్తులు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News