మొబైల్ కోసమే దొంగ దాడి చేశాడు
నాలుగు బృందాలతో గాలింపు
స్పష్టం చేసిన బంజారాహిల్స్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరో: సినీనటి చౌరాసియాపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. నగరంలోని కెబిఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి సోమవారం దాడి చేసి మొబైల్ ఫోన్ను ఎత్తికెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చౌరాసియాపై లైంగిక దాడికి యత్నం జరిగిందనే ఆరోపణలు రావడంతో పోలీసులు వివరణ ఇచ్చారు. మొబైల్ ఫోన్ కోసమే దుండగుడు దాడి చేశాడని తెలిపారు. అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకపోవడంతో పరిసర ప్రాంతాల కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నటిపై అత్యాచారం జరిగనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు.
వాకింగ్ చేస్తుండగా దాడి…
పార్క్లో చౌరాసియా వాకింగ్ చేస్తుండగా దుండగుడు ఆమెపై దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కెళ్లాడు. దొంగతో జరిగిన పెనుగులాటలో నటి చౌరాసియాకు చిన్నపాటి గాయాలయ్యాయి. మొబైల్ ఫోన్తో కెబిఆర్ పార్క్లోకి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా బ్యాంక్ ఉద్యోగిపై దాడి చేసి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్న విషయం తెలిసిందే. కెబిఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వరుసగా దారిదోపిడీలు జరగుతున్నాయి.