Tuesday, April 30, 2024

‘రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో’ రూ.2100 కోట్లు ట్రైటాన్ సంస్థ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

Triton Electric Vehicles Pvt invests in Telangana

జహీరాబాద్ నిమ్జ్‌లో ఇవి ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత
సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం
తొలి ఐదేళ్లలో 50వేల వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు
తమ పెట్టుబడి కోసం తెలంగాణ ఎంచుకున్నందుకు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు
దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారనుంది

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఎలక్ట్రిక్ వెహికల్ (ఇవి) రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ గురువారం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సూమారు రూ. 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది.

భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఇవి రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నదని కెటిఆర్‌కు కంపెనీ సిఇఒ హిమాన్షు పటేల్ తెలిపారు. తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన మీదట తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రికి వివరించారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ను దృష్టిలో ఉంచుకుని భారీగా (రూ. 2100 కోట్ల) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్ లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది.

కాగా రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైటాన్ సంస్థను మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహానాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడితో సుమారు 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఇవి పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అన్నారు. టీఎస్ ఐపాస్ లో మెగా ప్రాజెక్ట్ కి లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా ఇవి రంగ పెట్టుబడులకు ఒక అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు పలవురు కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News