Thursday, May 9, 2024

నాలుగో రౌండ్‌లోనూ పల్లాదే ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాల్లో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. నాలుగో రౌండ్ ఫలితాల్లోనూ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లారాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో నిలిచాడు. నాలుగో రౌండ్‌లో పల్లాకు పల్లాకు 63,442 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 48,004 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 39,615 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 15,934 ఓట్లు, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్‌కు 23,703 ఓట్లు పోలయ్యాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థిపై 15,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 2 లక్షల 23వేల 981 ఓట్ల కౌంటింగ్ జరిగింది. నాలుగో రౌండ్ ముగిసే సరికి మొత్తం 12,475 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.

TRS Candidate Palla Leads in Nalgonda MLC Polls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News