Friday, April 26, 2024

రంగనాయక సాగర్‌ కాల్వలో ఈతకొట్టిన రసమయి, ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: రంగనాయక సాగర్ కుడి, ఎడమ కాలువలకు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. అయితే, కాల్వల్లో ప్రవహిస్తున్న నీటిని చూసి ఆనందంతో పరవసించిపోయిన ఎంపి ప్రభాకర్‌ రెడ్డి, ఎంఎల్ఎ రసమయి బాలకిషన్‌ గోదావరి జలాల్లో తడిసిముద్దయ్యారు. ఇద్దరూ కలిసి చిన్న పిల్లల్లా కాల్వలో కాసేపు సరదాగా ఈత కొట్టారు. మంత్రి హరీశ్‌ రావు సైతం కాల్వలోని నీటిని ఇతరులపై చల్లుతూ.. అక్కడున్న ఇరిగేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. కాల్వల్లో ప్రవహిస్తున్న నీరు కనిపించేలా  హరీష్ రావు సెల్ఫీ తీసుకున్నారు.

TRS MP and MLA Swim in Ranganayaka Sagar Canal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News