Sunday, April 28, 2024

ఎల్బీనగర్‌లో టిఆర్ఎస్ 11 సీట్లు గెలుస్తాం: సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

TRS will win 11 seats in LB nagar Says Sudhir Reddy

మన్సూరాబాద్ : 25 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసిన ఘనత సిఎం కేసిఆర్ దక్కుతుందని ఎల్బీనగర్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలో వీరన్నగుట్టలో మన్సూరాబాద్ కార్పోరేటర్ అభ్యర్ది కోప్పుల విఠల్‌రెడ్డి గెలిపించాలని వీరన్నగుట్టలో ప్రచారం నిర్వహించారు. ఈసంధర్బంగా ఆయన మాట్లాడుతూ… 25 వేల కోట్ల పెట్టుబడి బహుళ జాతి సంస్దలు పెడుతున్నరంటే మామాలు మాట కాదని ,అన్నిరకాలు విశ్లేసించి పెట్టుబడులు పెడుతారని తెలిపారు. బహుళ జాతుల సంస్దలు పెట్టుబడులు పెట్టడంతో పది వేల నుంచి పదహేను వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కోన్నారు. భాజపా సోషల్ మీడియా తప్పడు వార్తలతో ప్రచారం నిర్వహిస్తుందని నమ్మవద్దని తెలిపారు. ఎల్బీనగర్ 11 కార్పోరేటర్లు సీట్లు ,బల్దియా 100 సీట్లు గెలిచి ,గులాబి జెండా ఎగురు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మీ బస్తీలో బస్తీ దవాఖాన ,మట్టిరోడ్లు నిర్మాణం చేపట్టిన ఘనత తెరాస ప్రభుత్వానిదే ,త్వరలో భూగర్బ డ్రైనేజి పూర్తి చేసి ,రోడ్లు వేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో జక్కడి రఘువీర్‌రెడ్డి ,బాలరాజ్ గౌడ్ ,కె కెఎల్ గౌడ్ ,ఆనంద్ తదితరులు పాల్గోన్నారు.

TRS will win 11 seats in LB nagar Says Sudhir Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News