Monday, April 29, 2024

తెలంగాణలో మరో 862 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

862 new covid-19 cases reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 862 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 164 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 53, జగిత్యాల 24, జనగాం 4, భూపాలపల్లి 11, గద్వాల 4, కామారెడ్డి 9, కరీంనగర్ 38,ఖమ్మం 63, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 15, మహబూబాబాద్ 8, మంచిర్యాల 26, మెదక్ 9 , మేడ్చల్ మల్కాజ్‌గిరి 91, ములుగు 11, నాగర్‌కర్నూల్ 10, నల్గొండ 35, నారాయణపేట్ 8, నిర్మల్ 2, నిజామాబాద్ 13, పెద్దపల్లి 37, సిరిసిల్లా 10, రంగారెడ్డి 57, సంగారెడ్డి 27, సిద్ధిపేట్ 20, సూర్యాపేట్ 28, వికారాబాద్ 8, వనపర్తి 11, వరంగల్ రూరల్ 12, వరంగల్ అర్బన్ లో 33, యాదాద్రిలో మరో 10 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,66,904కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,54,676కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

1450కి చేరువలో కోవిడ్ మరణాల సంఖ్య…

రాష్ట్రంలో కరోనా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1444కు చేరుకుంది. వీరిలో 44.96 శాతం మంది కేవలం కోవిడ్ 19తో చనిపోగా మరో 55.04 శాతం మంది కో మార్పిడ్ కండీషన్‌తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. దేశ వ్యాప్త కరోనా డెత్ రేట్ సగటున 1.5 శాతంగా తేలగా, మన దగ్గర మాత్రం కేవలం 0.54 శాతం మాత్రమే నమోదవుతుందని అధికారులు ప్రకటించారు.

95.41 శాతానికి పెరిగిన రికవరీ రేట్….

రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 95.41 శాతానికి పెరిగింది. వైరస్ సోకిన బాధితులకు సకాలంలో వైద్యం అందించడం వలనే వేగంగా కోలుకుంటున్నారని ఆరోగ్యశాఖ నివేదించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టెస్టుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 52 లక్షల 89 వేల 908 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 42 వేల 125 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు హెల్త్ బులెటెన్‌లో తెలిపారు. అదే విధంగా ప్రతి రోజు చేసే పరీక్షల్లో 44 శాతం మంది ప్రైమరీ కాంటాక్ట్‌లకు, మరో 12 శాతం మంది సెకండరీ కాంటాక్ట్‌లకూ టెస్టులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మరో వైపు ఇప్పటి వరకు పాజిటివ్ తేలిన వారిలో 1,86,833 మందికి అసింప్టమాటిక్‌తో వైరస్ తేలగా, 80,071 శాతం మందికి సింప్టమాటిక్‌తో కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News