Tuesday, April 30, 2024

30వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

TS Govt gives Orders to extend lockdown till May 30

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ వరకు లాన్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు,పోలీస్ కమిషనర్లు, ఎస్‌పిలను సిఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్‌డౌన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే అవకాశం ఉండేది. వ్యవసాయ ధాన్యం తరలింపు వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలు లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్, డీజిల్‌కు ఇబ్బంది పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం బంకులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.

TS Govt gives Orders to extend lockdown till May 30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News