Tuesday, April 30, 2024

తెలంగాణలో జూన్ 12న పాలిసెట్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశానికి పాలిసెట్ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బిటిఇటి) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మే 1వ తేదీ నుంచి పాలిసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుం లేకుండా మే 22 వరకు ఫీజు చెల్లించవచ్చని ఎస్‌బిటిఇటి కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. రూ.100 అపరాధ రుసుంతో మే 24 వరకు, రూ.3 వేల అపరాధ రుసుంతో తత్కాల్ కింద మే 25 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన పాలిసెట్ ఫలితాలు వెల్లడించనున్నట్లు వెల్లడించారు. కొవిడ్ కారణంగా పదవ తరగతిలో ప్రతి సబ్జెక్టులో 30 శాతం సిలబస్‌ను తగ్గించగా, 70 శాతం పాఠ్యప్రణాళిక ఆధారంగానే పాలిసెట్ ప్రశ్నపత్రాన్ని కూడా రూపొందించనున్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ డిప్లొమా సీట్లను కూడా పాలిసెట్ ఆధారంగానే భర్తీ చేస్తారు.

TS POLYCET 2021 Exam on June 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News