Friday, May 3, 2024

ఈనెల 25 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమిళనాడులోని అరుణాచలాన్ని సందర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అరుణాచలం సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసి ప్రకటించింది. ఈనెల 25వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. గతేడాది కూడా ఆర్టీసి ‘గిరి ప్రదక్షిణ’ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సమయంలో భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఈసారి కూడా ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. ఇక ఈ బస్సులు హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి అదే రోజు సాయంత్రం గిరి ప్రదక్షిణల పూర్తయిన తర్వాత అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణవుతారు.

ఇందుకోసం ఆర్టీసి ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. గతేడాది ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈసారి పెద్ద ఎత్తున బస్సులను పెంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 25వ తేదీన హైదరాబాద్‌లోని ఎంజీబిఎస్, బిహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్ నుంచి అరుణాచలంకు బస్సు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఇక టికెట్ విషయానికొస్తే ఒక్కో సీటుకు రూ. 3690లుగా నిర్ణయించారు. అరుణాచలం వెళ్లే ఆసక్తి ఉన్న ప్రయాణికులు ఆర్టీసి అధికారిక వెబ్‌సైట్ లేదా ఆర్టీసి కౌంటర్స్ వద్ద బుక్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఇక మరింత సమాచారం కోసం 9959226257, 9959224911, 040- 69440000, 040 23450033 నెంబర్‌లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News