Thursday, May 16, 2024

గవర్నర్ తమిళిసైతో ముగిసిన ఆర్టీసి యూనియన్ నాయకుల చర్చలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః గవర్నర్ తమిళిసైతో ఆర్టీసి యూనియన్ నాయకుల బృందం చర్చలు ముగిశాయి. టిఎంయూ నాయకులు గవర్నర్‌తో గంటకుపైగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం టిఎంయూ కార్మికసంఘాల నేత థామస్ రెడ్డి మాట్లాడుతూ.. “బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరాం. గవర్నర్ మా సమస్యలు విని సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ వివరణ తర్వాత బిల్లు ఆమోదిస్తానని గవర్నర్ తెలిపారు.

కార్మికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ తెలిపారు. ఆర్టీసి కార్మికులకు గతంలోనూ అండగా ఉన్నానని గుర్తు చేశారు. ప్రభుత్వ వివరణ తనకు అందలేదని గవర్నర్ చెప్పారు. గవర్నర్ హామీతో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నాం. గవర్నర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News