Saturday, May 4, 2024

మటన్ ముక్క కోసం స్నేహితుడి ప్రాణం తీశాడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మటన్ ముక్క కోసం స్నేహితుడి ప్రాణం తీసిన సంఘటన సికింద్రాబాద్‌లోని తుకారం గేటు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోల్‌బాయ్ బస్తీలో చారి, అజయ్ అనే స్నేహితులు ఉన్నారు. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ మటన్ తింటున్నారు. మటన్ ముక్క విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో చారి కత్తి తీసుకొని అజయ్‌పై దాడి చేశాడు. సున్నితమైన ప్రదేశాలలో కత్తి పోట్లు పడడంతో అజయ్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News