Friday, April 26, 2024

25వ అంతస్థు నుంచి పడి కవలలు మృతి

- Advertisement -
- Advertisement -

 

లక్నో: 25వ అంతస్థు నుంచి పడి కవలలు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సత్యనారాయణ, సూర్యానారాయణ అనే కవలలు తొమ్మిదోవ తరగతి చదువుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి తల్లిదండ్రులతో పాటు ఘజియాబాద్‌లో నివసిస్తున్నారు. సిద్ధార్థ విహార్ కాంప్లెక్స్‌లోని 25వ అంతస్థు నివాసం ఉంటున్నారు. ఇద్దరు కలిసి బాల్కనీలో ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతుండగా తల్లి మందలించి బెడ్‌రూమ్‌లోకి పంపించింది. తల్లిదండ్రులు పడుకున్న తరువాత వారు బాల్కనీలోకి వచ్చి సెల్‌ఫోన్లు గేమ్స్ ఆడుతూ కిందపడ్డారు. తల్లి మెలుకువ వచ్చి చూడగా పిల్లలకు కనిపించలేదు. గ్రౌండ్ ఫ్లోర్‌లో జనాలు గూమిగూడడంతో అక్కడి వెళ్లిచూడగా ఇద్దరు కుమారులు రక్తపు మడుగులో కనిపించారు. గుండెలు విలిసేలా  ఆమె రోదించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాల్కనీలో ప్లాస్టిక్ చైర్, దాని మీద కూర్చి కనపడడంతో చంద్రుడి చూడాలని ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News