- Advertisement -
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ఎలవేటెడ్ ఎక్స్ప్రెస్పై కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు మృతి చెందారు. కారు ఫ్లైఓవర్ల పై వేలాడుతూ కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనంపై ఇద్దరు వెళ్తుండగా కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది. ఇద్దరు ఫ్లైఓవర్ల పైనుంచి పడి మృతి చెందారు. కారు పిట్టగొడ మీదకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులలో మహిళ, ఓ వ్యక్తి ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -