- Advertisement -
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వల్బాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -