తమిళనాడులో ఇద్దరు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్గా గుర్తించారు. వీరిలో ఒకరు ఒక తమిళ దినపత్రికలో రిపోర్టర్ కాగా మరొకరు తమిళ న్యూస్చానల్లో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. కాగా రిపోర్టర్ను రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో, మరో జర్నలిస్టును ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్పారు. వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాగా శనివారం రాత్రి అలందూర్ పోలీసు క్వార్టర్స్లో ఉంటున్న ఓ సబ్ ఇన్స్పెక్టర్కు కరోనా వైరస్ సోకడంతో ఆయనకు కూడా రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కాగా ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటన మేరకు జర్నలిస్టుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జి ప్రకాష్ చెప్పారు.
Two Journalist tests positive for Covid 19 in TN