Saturday, April 27, 2024

రెండు బైకులను ఢీకొట్టిన లారీ: ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Two killed in road accident at Khammam

 

పెనుబల్లి: ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం రామచందర్ రావు బంజర వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి రెండు బైకులను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన మరొకరిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను బయ్యన్నగూడెం వాసి పుల్లారావు(35), బీఎం బంజర వాసి రోహిత్(24)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News