Sunday, May 12, 2024

లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు దుర్మరణం…

- Advertisement -
- Advertisement -

Two Members dead in Car collided lorry

అమరావతి: లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి వెళ్తున్న కారు మదనపల్లి వైపు నుంచి వస్తున్న లారీని ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ఇద్దరు దుర్మరణం చెందగా ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మర్రిపాడు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. మృతులు మంత్రి ఆళ్ల నాని దూరపు బంధువులుగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News