Thursday, May 2, 2024

కరోనాకు అన్నదమ్ములు బలి

- Advertisement -
- Advertisement -

Rising coronavirus deaths

 

లక్నో: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెలబ్రిటీలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కరోనా వైరస్  బలి తీసుకుంటుంది. కరోనాతో చనిపోయిన కుమారుడికి చితికి నిప్పు పెట్టగానే రెండో కుమారుడు దుర్మరణం చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… జలాల్‌పూర్ గ్రామంలో అత్తర్ సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇద్దరు కుమారులు కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నారు. పంకజ్ అనే కుమారుడు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతడి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా రెండో కుమార్ దీపక్ ఇంట్లో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికి అప్పటికే మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గంటల వ్యవధిలో ఇద్దరు కుమారులు చనిపోవడంతో అత్తర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News