Sunday, April 28, 2024

ఘర్షణ…. ఇద్దరి ప్రాణాలు తీసింది….

- Advertisement -
- Advertisement -

Two Members dead with fighting in karnataka

బెంగళూరు: వదిన-మరదలి మధ్య ఘర్షణ ఇద్దరు ప్రాణాలు తీసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మండ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గిరి- ప్రియాంక(35) అనే దంపతులు కంబదహళ్లి గ్రామంలో నివసిస్తున్నారు. గిరికి సోదరి గీతా(25) ఉంది. ప్రియాంక గర్భవతి కావడంతో మండ్యలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకొని ఇంటికి వచ్చింది. గీతా భర్త కరోనా వైరస్‌తో చనిపోవడంతో తన అమ్మగారింట్లో ఉంటుంది. శనివారం రాత్రి గీతా- ప్రియాంక మధ్య గొడవ జరిగింది. ప్రియాంక ఇంట్లో ఉండలేనని, పుట్టింటికి వెళ్లిపోతానని గదిలోకి వెళ్లి బట్టలు తీసి బ్యాగ్‌లో సర్దుకుంటుంది. వెనక నుంచి గీతా బండ రాయితో ప్రియాంక తలపై గట్టిగా బాదింది. ప్రియాంక చనిపోవడంతో తన రూమ్‌లోకి వెళ్లి గీతా ఉరేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News