Saturday, April 27, 2024

వివాహేతర సంబంధం… ప్రియుడితో కలిసి భర్తను చంపి…

- Advertisement -
- Advertisement -

Lover who strangled an inter student in Visakhapatnam

నల్లగొండ: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడి కలిసి అతడిని భార్య హత్య చేసిన సంఘటన నల్లగొండ జిల్లా మేళ్ల చెరువు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కందిబండ గ్రామంలో ముళ్లగిరి ముత్యాలు- నాగరాణి అనే దంపతులు నివసిస్తున్నారు. మెరిగ నవీన్‌తో నాగరాణి వివాహేతరం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ముత్యాలకు తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. భర్త ఉండగా వివాహేతర సంబంధం కొనసాగించడం కష్టంగా ఉండడంతో అతడిని హత్య చేయాలని ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. జూన్ 7న రోజు వారి కూలీ వెళ్లిన ముత్యాలు ఇంటికి మద్యం మత్తులో వచ్చాడు. భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత ప్రియుడి నవీన్‌తో కలిసి మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. మంగళవారం ఉదయం తన భర్త నిద్రలో గుండెపోటుతో చనిపోయాడని బంధువులను, కుటుంబ సభ్యులను నమ్మించింది. వెంటనే అంత్యక్రియలు జరిపించింది. కుటుంబ సభ్యులకు అనుమానం ఉండడంతో ఆమెను నిలదీయగా హత్య చేశానని ఒప్పుకొని ఘటనా స్థలం నుంచి పారిపోయింది. మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి తహసీల్దార్ దామోదర్ రావు, సిఐ శివరామిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ప్రియుడు పారిపోయారని పోలీసులు వెల్లడించారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్‌ఐ నరేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News