Wednesday, May 15, 2024

ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులతో పాటు కమాండర్ హతం

- Advertisement -
- Advertisement -

Two terrorists including a top commander neutralised

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. షాదిక్ ఖాన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు లష్కరే తోయిబా కమాండర్ హతమయ్యాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో 2017 నుంచి కమాండర్ ఇష్ఫాక్ దార్ అలియాస్ అబు అక్రమ్ దాడులకు వ్యూహరచనలు చేస్తున్నాడు. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ తెలిపాడు. శుక్రవారం శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా ఇద్దరు తీవ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News