Tuesday, April 30, 2024

లఖింపూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం: మావోయిస్టు పార్టీ

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఘటనను ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శనివారం లేఖ విడుదల చేశారు. లఖిoపూర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా తన కారుతో ఢీ కొట్టి నలుగురు రైతులను హత్య చేయడాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనకు కారణం అయిన దోషులను కఠినంగా శిక్షించాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉద్యమాన్ని విస్తరింపజెయ్యాలని మూడు సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. రైతు ఉద్యమాన్ని తీవ్రం చెయ్యవలసిన అవసరం ఉంది అని కేంద్ర మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ లేఖలో పేర్కొన్నారు.

Union Maoist Party denied Lakhimpur Incident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News