లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉమ్మినందుకు కత్తితో పొడిచి చంపేశారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోట్వాలి సిటీలో గురువారం కథూరియా అనే వ్యక్తి తన భార్యతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. సతీష్ అనే వ్యక్తి రోడ్డు పక్కన తన స్నేహితులతో కలిసి ముచ్చటిస్తున్నాడు. అదే సమయంలో కథూరియా తన భార్యతో కలిసి అక్కడికి రాగానే సతీష్ రోడ్డుపై ఉమ్మాడు. ముఖానికి మాస్కులు లేవని రోడ్లు ఉమ్మివేయడం సరికాదని వాళ్లను హెచ్చరించాడు. సతీష్, కథూరియా మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. వెంటనే కథూరియా కత్తి తీసి సతీష్ను పొడిచి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. వెంటనే సతీష్ను స్థానిక తరలించినప్పటికి చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీస్ అధికారి అనిల్ కపారాన్ తెలిపాడు. సతీష్ బ్రదర్ మాత్రం కథూరియా కావాలని తన తమ్ముడిని పొడిచాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.