హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన ‘వి వన్’ చానల్ ఎండీ ప్రశాంత్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసుపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రశాంత్ నగరంలోని కెపిహెచ్ పిలో నివాసం ఉంటూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇప్పిస్తానని అమాయక ప్రజలను మోసం చేశాడు. ఒక్కోక్కరి వద్ద నుండి లక్షా 70 వేల రూపాయలు వసూలు చేశాడు. మొత్తం 40 మందిని మోసం చేసి 70 లక్షల మేర ప్రశాంత్ కాజేశాడు. మీడియాలో పనిచేస్తున్నానని.. నాకు పెద్ద, పెద్ద వాళ్ళు తెలుసని చెప్పి మోసాలకు పాల్పడ్డాడు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ అలార్ట్ మెంట్ లెటర్స్ తయారు చేసి ఇచ్చాడు. గతంలో ఎస్ఐ అని చెప్పి ప్రజలను మోసం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు అని వివరించారు. నిందుతుని నుంచి 8 లక్షల రూపాయల నగదు, ఒక కారు, నకిలీ అలార్ట్ మెంట్ లెటర్స్, లాప్ టాప్, ప్రింటర్, నకిలీ ఎస్ఐ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
V1 Channel MD Prashanth Arrested by Cyberabad Police