Sunday, April 28, 2024

చెంచులకు వ్యాధి నిరోధక టీకాలు

- Advertisement -
- Advertisement -

మన్ననూరు : అమ్రాబాద్ మండలం మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొమ్మన్ పెంట, కొల్లంపెంటలలో గురువారం మిషన్ ఇంద్ర ధనుస్సులో భాగంగా డ్రాప్ ఔట్ పిల్లలకు టీకాలు వేయడం జరిగిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి కావలసిన మాత్రలు, టానికులు పంపిణీ చేసి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఉప మలేరియా అధికారి అశోక్ ప్రసాద్, ఆరోగ్య పర్యవేక్షకురాలు పార్వతి, ఆరోగ్య కార్యకర్తలు భారతి, లక్ష్మణ్, ఎంఎల్‌హెచ్‌పి వంపు సులోచన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News