Monday, April 29, 2024

కర్నూలు పట్టణంలో ఎన్‌ఐఏ సోదాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు పట్టణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో కేంద్ర ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు. పాతబస్తీ, ఆటో నగర్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

అనంతరం అనుమానితులను పోలీస్‌ రెస్ట్‌హౌస్‌కు తరలించి విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ పట్టణంలో ఎన్‌ఐఏ సోమవారం ఉదయం సోదాలు నిర్వహించింది. పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. ఆ వ్యక్తి ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News